Tuesday, December 29, 2015

కూడలి మూసివేత అత్యంత బాధాకరం


కూడలి సంకలిని మూసివేయడానికి గల కారణాలేంటో తెలియడం లేదు .
'ఏదోలా కొనసాగించే అవకాశం ఉండి కూడా, అస్తమయమే మేలని అనుకోవడం ' అర్ధం కావడం లేదు .

తెలుగు లో వ్రాసేవారు, చదివే వారు తగ్గిపోతున్న ఈ రోజుల్లో , ఈ మూసివేత ఖచ్చితంగా బాధాకరమే .
తెలుగు బ్లాగుల్లో నేను చూసిన అత్యంత పాత సంకలిని కూడలి మాత్రమె.  నిజం చెప్పాలంటే బాగా అలవాటయిపోయిన వెబ్సైటు .

నేను నా స్నేహితులకి చాలా మందికి కూడలి ని పరిచయం చేసాను , విడి విడి గా బ్లాగ్  పేర్లు చెప్పలేక , కూడలి or మాలిక చూస్తె మీకు కావలసినన్ని బ్లాగ్ లు ఉంటాయని చెప్పేవాన్ని.

దయచేసి పునరాలోచిన్చుకోవల్సిన్డిగా అభ్యర్దిస్తున్నాను .  మిగిలిన బ్లాగర్లు కూడా స్పందిన్చవలసిన్డిగా కోరుతున్నాను .



Saturday, December 26, 2015

Friday, December 25, 2015

రాడికల్ ఇస్లాం గురించి కొంత సమాచారం మరియు వీడియో అంకెలు తో సహా

రాడికల్ ఇస్లాం గురించి కొంత సమాచారం మరియు వీడియో అంకెలు తో సహా .. ఈ పోస్ట్ కేవలం రాడికల్ ఇస్లాం గురించి మాత్రమె.
సర్వే లో కొంత  భాగం  PeW రీసెర్చ్ సెంటర్ . 39 దేశాలలో .
ఇది క్లారియన్ ప్రాజెక్ట్ లో భాగం



గత కొన్ని సంవత్సరాలు గా , ప్రపంచం అంతా బాధపడుతుంది , ప్రపంచాన్ని పీడిస్తూ ఉన్నది , ఇంకా దారుణమైన పరిస్తితులు ఎదురవుతాఎమో అని భయపడేది ఒకే ఒక్కదానికి అదే రాడికల్ ఇస్లామిజం .

ప్రపంచం లో ఎక్కడ  టెర్రరిస్ట్ లు ఎటాక్ చేసినా , మన నాయకులు సానుభూతి తెలపడం కంటే ముందు గా ఒక మాట చెప్తారు అదే " ఇస్లాం కి టెర్రరిజం కి ఏ సంబంధం లేదు " అని .  నిజం చెప్పాలంటే ఇది మనకి కొత్త కాదు, బాగా అలవాటైన స్టేట్మెంట్ .

నాయకులకి సెక్యూరిటీ ఉంటుంది కాని , సామాన్యులకి కాదు కదా .  గత కొన్ని నెలలు లో , యూరోప్ మరియు అమెరికాలలో ఎంత మంది అమాయుకులు బలి అయోపోయారో మీకు తెలుసు .మనకి కొత్త కాదు , కాని పాపం అమెరికన్స్ , యూరోపియన్స్ ని ఇప్పుడిప్పుడే ఈ మాటలు వింటున్నారు .

ఒబామా , హిల్లరీ , డేవిడ్ కెమరూన్ లు ఇంటర్వ్యూ లు వింటే మీరు మరిన్ని మాటలు వినొచ్చు .ఒబామా అయితే 99.99% ముస్లిమ్స్ కి ఈ రాడికల్ ఇస్లాం లో సంబంధం లేదు అని చెప్పారు .కాని సామాన్య జనాలకి విషయం తెలుసు కాబట్టి డోనాల్డ్ ట్రంప్ కి మెజారిటి పెరుగుతుంది .


దారుణం ఏంటంటే, ఎవరైనా మితవాదులు ధైర్యం చేసి మాట్లాడిన, వాళ్ళని అసహన వాదులు గా, రేసిస్ట్ లు అని ముద్ర వేసేస్తున్నారు , దాని వల్ల మిగిలిన వాళ్ళు కూడా బయటకి రావడం లేదు .

కొంతమంది చెప్పినట్టు ,  పెట్టుబడి దారుల స్వార్దమే ఈ టెర్రరిజం కి కారణమా ??
అమెరికా లో ముస్లిమ్స్ టెర్రరిజం కి మద్దతివ్వరని  అమెరికా నాయకులు బలంగా నమ్మారు , దానికి కారణం ఏంటంటే ,  మంచి జీవితాన్ని వెతుక్కుంటూ వచ్చిన ముస్లిమ్స్ కి అమెరికా ఆశ్రయం ఇచ్చింది , అటువంటి ఆశ్రయం ఇచ్చిన దేశం మీద టెర్రరిస్ట్లు  దాడులు ఎందుకు చేస్తారు అని , కాని ఏమైంది ??  ఇప్పుడు అమెరికా లోఎంత  భయం ఆవరించి ఉందొ మీకు తెలుసు . అలానే యూరోప్ దేశాలు కూడా , తమ దేశాలలో అరాచకాలు భరించలేక శాంతి కోసం , తిండి మరియు వసతి కోసం ఆశ్రయం కోరుతూ వచ్చిన వేల మంది ముస్లిమ్స్ కి ఈ యూరోప్ దేశాలు ఆశ్రయం ఇచ్చాయి , ఇప్పుడు ఎక్కడ ఏ బాంబు పేలుతుందో అని భయంగా ఉన్నాయి .

మంచి జీవితం, మనవ హక్కులు బలంగా ఉన్న దేశం, ప్రపంచం లో ప్రతీ ఒక్కరు ఆశపడే జీవితం వాళ్ళ సొంతం. వ్యక్తిగత స్వేచ్చ, ప్రభుత్వం తీసుకునే సామాజిక రక్షణ కి అయితే సలాం చెప్పొచ్చు, పిల్లల రక్షణ కి భత్యం ఇస్తారు. నిరుద్యోగులకి భత్యం, ఇవన్ని ఉండి కూడా వేల  మంది ఇసిస్ లో జాయిన్  అవుతున్నారు యూరోప్ నుండి , ఇందులో కూడా పెట్టుబడిదారి తనపు స్వార్ధమా ?? లేక రాడికల్ ఇస్లాం కారణమా ?  పేదరికం లేని దేశాల నుండి కూడా టెర్రరిజం కి ఆకర్షితులవ్వడం ఏ  విధానం లోకి వస్తుంది .

టెర్రరిజాన్ని  పెట్టుబడిదారి కోణం నుండి , కమ్యునిజం కోణం నుండి , అమెరికా కోణం నుండి మాత్రమె ఎందుకు చూడాలి , వేరే కోణం నుండి చూసే ప్రయత్నం ఏ మాత్రం చేయలేకపోవడం ఆశ్చర్యం అనిపిస్తుంది.
ఈ పెట్టుబడిదారి విధానం అంటూ ఒకటి లేనప్పుడే , సున్ని షియా గొడవలు ఉన్నాయి , అరబ్ దేశాలలో జాతులు మధ్య యుద్దాలు జరిగాయి ,  Jews ని సహించలేనంత ద్వేషం ఉంది . మరి వీటి కోణం లో చూడకుండా చేసిన ఏ విశ్లేషణ అయినా అసంపూర్తిగానే ఉంటుంది , ఈ మధ్యన చదివిన వహబిజం ఆర్టికల్ .  ఇసిస్ ని అర్ధం చేసుకోవాలంటే వాళ్ళ విధానాలు ఇస్లాం లో ఏ తెగ లేక జాతి కి అనుగుణంగా ఉన్నాయి .
http://www.huffingtonpost.com/alastair-crooke/isis-wahhabism-saudi-arabia_b_5717157.html



సుమారు 1. 6 బిలియన్ ముస్లిమ్స్ ఉన్నారు ఈ ప్రపంచం లో. అత్యంత వేగంగా ఎదుగుతున్న మతం ఇస్లాం .
2 లక్షల మంది ముస్లిమ్స్ ఇసిస్ కోసం పనిచేస్తున్నారు ప్రపంచం లో ( మీ పక్కనే ఒకరు  ఉండొచ్చు  ).
మరి కొన్ని లక్షల మంది  అల్కైదా , హమాస్ , ఇతర టెర్రరిస్ట్ సంస్థ ల కోసం పని చేస్తున్నారు.
వీళ్ళంతా కరుడు గట్టిన జిహాదిలు , వీళ్ళు కాకుండా వీళ్ళ విధానాలని పూర్తిగా సమర్దిస్తూ సామాన్య జీవితం బ్రతికే మనుషులు కోట్ల లో ఉన్నారు .

కాని ఈ మొత్తం ముస్లిం జనాభా లో ఎంత మంది రాడికల్ ఇస్లాం ని సమర్దిస్తున్నారు .  యెంత మంది extremism ని సమర్దిస్తూ మాట్లాడుతున్నారు , వాళ్ళ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి .

ఆత్మాహుతి దాడులని ఎంతమంది సమర్దిస్తున్నారో తెలుసా `??


ఇస్లాం ని వదిలి వెళ్ళిపోయిన వాళ్ళని చంపెయాలా అని అడిగితె ??
27% అంటే 237 మిలియన్ ముస్లిమ్స్ . 


యూరోప్ నుండి ఇసిస్ ఇరాక్ మరియు సిరియా లో ఎంతమంది ఉన్నారో తెలుసా ?

షరియా చట్టం ఉండాలి అని చెప్పిన వెస్ట్రన్ ముస్లిమ్స్ యెంత మంది ??


కొరడాలతో కొట్టడం , అవయవాలు తీసేయడం లాంటి శిక్ష లని సమర్దించే ముస్లిమ్స్ ఎంతమంది ??
281 మిలియన్ ముస్లిమ్స్ వాటిని సమర్దించడం చూస్తుంటే మన భవిష్యత్ తరాల గురించి భయంగా ఉంది . 
అంతే కాదు,289 మిలియన్ ముస్లిమ్స్ రాళ్ళతో కొట్టే శిక్ష ని సమర్దించారు . 

దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి మరిన్ని వివరాల కోసం . నేను రాయగలిగింది కొంత మాత్రమె . 







Tuesday, December 15, 2015

అనుకున్నట్టే అయ్యింది . విజయవాడ కమీషనర్ ని తోసేసారు .

అనుకున్నట్టే అయ్యింది . విజయవాడ కమీషనర్ ని తోసేసారు .

 పాపం సాయికుమార్ లెవెల్లో , ఆడ కూతుళ్ళకి న్యాయం చేస్తానని ఎగేరేగిరి పడ్డాడు.
కూతురుని పక్కలో పడుకోబెట్టమని తల్లిని అడిగిన దుర్మార్గులని వదిలిపెట్టేది లేదని చెప్పాడు .
చీల్చి చెండాదతానని ప్రతిజ్ఞ చేసాడు .
భాదితుల మాటలు ఫోన్ లో వింటుంటే కడుపు రగిలిపోతుంది అని చెప్పాడు .

ఏమైంది ...   ఫ్లైట్ దిగిన " బోడె ప్రసాద్ " ఒక్క బోల్లెడుపు ఏడ్చాడు మొత్తం తుస్స్ మని ఎగిరిపోయింది .

చంద్రబాబు సమీక్ష చేసి ,  దర్యాప్తు నిష్పక్షపాతంగా, నిజాయితీ గా జరుగుతుందని తెలిసి ఆశ్చర్యపోయారు.
కమీషనర్ సెలవు .


దానికి ఈనాడు , ఆంధ్రజ్యోతి వంత పాడటం మామూలే ..

 ఇంత పెద్ద కేసు దర్యాప్తు చేస్తున్న కమీషనర్ సెలవు లో వెళితే , ఈనాడు ఒకే ఒక్క లైన్ లో రాసింది . అది కూడా హెడ్డింగ్ కాదు , లోపల ఒక్క లైన్ లో , డిజిపి గారు ఇలా చెప్పారు అని అంతే . ఆంధ్రజ్యోతి ఎలాగు వేయదు .



Sunday, December 13, 2015

తెలుగు చిత్ర పరిశ్రమ దౌర్భాగ్యం ..

మన తెలుగు చిత్ర పరిశ్రమ కి ఒక అసోసియేషన్ ఉంది , దానికి ప్రెసిడెంట్ , సెక్రటరీ లాంటి వారు ఉన్నారు .
అయినా మా (MAA) కి వైస్ ప్రెసిడెంట్ అయి ఉండి కూడా , తన సొంతంగా "మన మద్రాస్" పేరుతొ కార్యక్రమం పెట్టడం లో మన లక్ష్మక్క ఔచిత్యమ్ ఏంటో అర్ధం కావడం లేదు . 
పాపం రాజేంద్రప్రసాద్ ఏదో ముళ్ళ కిరీటం లా భరిస్తున్నాడు . పోటి లోకి దిగిన తరువాత వెనక్కి వెళ్ళలేక  అహం అడ్డొచ్చి నిలబడ్డాడు , అప్పటకి టీవీ9 లో చెప్పాడు, ముందే నాతో చెప్పి ఉంటె నేను పోటి లో ఉండేవాడిని కాదు అని .
మురళి మోహన్, మోహన్ బాబు , సీనియర్ నరేష్  , అలీ అంతా వెన్నుపోటు పొడిచారు . శివాజీరాజ వాపోయాడు అలీ ముందు నాతో చెప్పలేదు అని .

తెలుగు చిత్ర పరిశ్రమ అంత కలిసి చేయడం ఒకటి , ఇలా ఎవరికి వారు చేసుకోవడం ఒకటి . MAA కి వైస్ ప్రెసిడెంట్ హోదాలో ఉండి కూడా లక్ష్మక్క ఇలాంటివి ప్రోత్సహించడం గర్హనీయం .

కాల్ మనీ ముఠా అక్రమాలలో 'ఈనాడు' కక్కలేక మింగలేక

కాల్ మనీ  ముఠా అక్రమాలలో ఈనాడు కక్కలేక మింగలేక , వాళ్ళ పేర్లు బయట పెట్టలేక, దాయలేక కింద మీద పడుతుంది .
చూస్తుంటే ఈ ముఠా లో తెలుగు దేశం నాయకులూ భాగస్వామ్యం చాలా పెద్ద ఎత్తున ఉన్నట్టుంది .
ఎమ్మెల్సి , ఎమెల్యే ఉన్నట్టున్నారు . దాంతో వాళ్ళంతా "ప్రజా ప్రతినిధి" లు అయిపోయారు .
సాక్షి లో డైరెక్ట్ గా పేర్లు వస్తున్నాయి , ఫేస్బుక్ లో ఫోటోలు షేర్ అవుతున్నాయి .. ఈనాడు కి మాత్రం " ప్రజా ప్రతినిధి ",  పాపం ఈనాడు , సాక్షి వచ్చిన తరువాత కొన్ని విషయాలు కవర్ చేయలేక బాగా ఇబ్బంది పడుతుంది .

ఇంతకు ముందు సాక్షి కి ఈ ఇబ్బంది బాగా ఉండేది .
ఈ విషయం ఆంధ్రజ్యోతి ని మెచ్చుకోవాలి , ఆ పేపర్ కి ఇలాంటి ముసుగులో గుద్దులాట లేదు , తెలుగు దేశం పార్టి నేతలు ఉన్నచోట , డైరెక్ట్ గా వైఎస్ఆర్ పార్టి నేతలు అని రాసెస్తుంది , లేకపోతె ఆ వార్తే కనిపించదు ఆ పేపర్ లో . 

Monday, November 30, 2015

అజాంఖాన్ కి తెలియని నిజం


అహింస తో స్వాతంత్ర్యాన్ని సాధించిన మనం , అసహనం తో ఎందుకు మాట్లాడతాం . మనసు ఎంతో గాయపడితే తప్ప .. ఎన్ని బాంబు లు పేలినా, ఎంత మందిని చంపేసినా, మన స్నేహితులే వాళ్ళు , ఏ రోజు మన మనసు లో ద్వేషం రాలేదు .
అర్ ఎస్ ఎస్
పాపులర్ ఫ్రంట్
ఎం ఐ ఎం
ఢిల్లీ , హైదరాబాద్, బెంగుళూరు , బొంబాయి ఎన్ని జరిగాయి , లెక్కే లేదు . ఎన్ని జరిగినా ఎవరు సహనం కోల్పోలేదు , మతం మనిషిని చంపదు అని మీరే చెప్పారు అదే మేము నమ్మాము .  మరి ఇప్పుడు జరిగిన సంఘటన కూడా అదే కదా, అలానే మాట్లాడాలి కదా ,  లేదు , అవకాశం  కోసం చూస్తున్న రాబందులు అని అర్ధం అయింది .  ఇన్నాళ్ళు మీరు మనసులో పెట్టుకున్న ద్వేషం బయటకి కక్కి రంగు పోయిన నక్కల్లా కనిపిస్తున్నారు .
ఎలెక్షన్ కి ముందు ఎన్ని ఎలుకలు , ఇప్పుడు ఒక్క ఎలుకా రావడం లేదు , విచిత్రం .


మొత్తం హిందూ సమాజాన్ని తూలనాడుతూ ఉంటె , మరి ఇన్నాళ్ళు  మేము భరించిన ఈ సహనం ఏమైపోయింది  ?? ఒక సామాన్య హిందువు తిరగబడటం తప్పిపోయింది ఈ కుహానా లౌకిక వాదులకి .

ఈ కుహాన లౌకిక వాదులు ఏమన్నా మాట్లాడారా దీని మీద ..మాట్లాడి ఉంటె లింక్ ఇవ్వండి ..





Sunday, November 29, 2015

ఈ వీడియో చివరి వరకు చూడండి

ఈ వీడియో చివరి వరకు చూడండి .. 
మన జీవితం బాగుంది , కాని మన పిల్లల, మనవళ్ళ జీవితాలు ఎంత డేంజర్ లో ఉన్నాయో అందులో నంబర్స్ చూస్తుంటే వొళ్ళు గగుర్పాటు వస్తుంది . 

Monday, November 23, 2015

వెల్లిపొండిరా బాబు వెళ్ళిపొండి ,

వెళ్ళిపొండి రా బాబు వెళ్ళిపొండి ..

ముంబై మీద టెర్రరిస్ట్ లు దాడి చేసినప్పుడు లేని భయం .
బెంగుళూరు లో పేలుళ్లు జరిగినప్పుడు లేని భయం ..
హైదరాబాద్ లో టెర్రరిస్ట్ లు జనాన్ని చంపినప్పుడు లేని భయం ..
ఒవైసి కుటుంబం పాతబస్తీ లో చేసే అరాచాకాలకి లేని భయం
ఒవైసీ అన్నదమ్ములు తస్లిమా నస్రీన్ ని నడి రోడ్ మీద జుట్టు పట్టుకుని తన్నినప్పుడు లేని భయం ..

ఇప్పుడు బిజెపి అధికారం లోకి రాగానే మీకు భయం వేసిందా ? ఏమి ద్వంద్వ ప్రమాణాలు రా మీవి ..

ఇంకా బయటకి రాని ఎలకలు ఎన్నో ..   మీలాంటి జనాలు ఇండియా లో ఉంది మా బతుకులు ని భయం భయంగా చేసేకంటే మీరు వెళ్ళిపోతే మేము ప్రశాంతంగా బ్రతుకుతాం ..

నువ్వు పీకే సినిమా తీసి హిందువు లని బఫూన్ లని చేసి చూపించినా, హిందువులు ఎగేసుకుంటూ చూసారు నీ సినిమాని , అంతే కాదు అతి పెద్ద హిట్ చేసారు , అటువంటి సినిమా నీ సొంత మతం లో కూడా తీసే ఆలోచన చేయలేవు , అటువంటి ఈ దేశం లో నీకు భయమా ??

మీకు తగిన దేశాలు

పారిస్ ,
సౌదీ అరేబియా
పాకిస్తాన్
సిరియా
ఇరాక్
బ్రిటన్
అరబ్
నైజీరియా
సుడాన్
ఆఫ్ఘనిస్తాన్
బంగ్లాదేశ్

ఇంకా చాలా ఉన్నాయి .. ఇక్కడ లేని స్వేచ్చ , స్వాతంత్ర్యం దొరుకుతాయి "మీలాంటి" జనాలకి .



Friday, November 13, 2015

గిరిజనులను మత మార్పిడి గురించి ఈ మేధావులు ఎందుకు మాట్లాడటం లేదో అర్ధం కావడం లేదు


ఈ మధ్యన ఒక వార్త చదివే ఉంటారు మీరు. నక్సలైట్లు చర్చి ఫాదర్ కొడుకుని కిడ్నాప్ చేసారు .
మత మార్పిడులు ఆపమని ఎన్నిసార్లు చెప్పినా వినడం లేదని , చర్చి ఫాదర్ ని కిడ్నాప్ చేయడానికి వస్తే ఆటను దొరకక , అతని కొడుకుని కిడ్నాప్ చేసారు .

గిరిజనులు ఎక్కువగా ప్రకృతి ని కొలుస్తారు , వారి జీవనం పూర్తిగా వేరుగా ఉంటుంది , ఆచారాలు వ్యవహారాలూ అన్ని ప్రక్రుతి తో దగ్గరగా ఉంటాయి . హిందువులు అని కూడా చెప్పలేము . అత్యంత అమాయకులు , మోసం దగా లాంటివి తెలియదు .  నేను చింతపల్లి ఏరియా లో తిరిగినప్పుడు ఎక్కడ చూసిన చర్చి లే కనిపిస్తున్నాయి , అవి కూడా మాములుగా కాదు చాలా పెద్దవి  , చర్చి లు కట్టడం తప్పు కాదు , కాని హాస్పిటల్ , స్కూల్ కూడా సరిగ్గా లేని ఇటువంటి ఊళ్లలో చర్చి లు ఉండటం , మనకి అత్యంత సులువుగా అర్ధమవుతుంది .

నిజం చెప్పాలంటే గత యాబై సంవత్సరాలు గా ఈ మత మార్పిడులు జరుగుతున్నాయి .  దేశం లో ఉన్న పేదరికాన్ని , కులాల గోడవలని , గిరిజనుల అమాయకత్వాన్ని ఆసరా గా చేసుకుని ఈ మతమార్పిడులు దిగ్విజయంగా కొనసాగుతున్నాయి , అఫ్ కోర్స్ పాలకుల సహాయ సహకారం కూడా ఉందనుకోండి .

కాని గిరిజనులు ని ప్రలోభపెట్టడం చాలా అన్యాయం , అన్నెం పున్నెం ఎరగని ఆ అమాయకులని దేవుడు, దెయ్యం అనే పేరుతొ మభ్యపెట్టి మతమార్పిడులు చేయడం తీవ్రంగా ఖండించాలి .  వారి సహజ జీవనానికి దూరం చేయడం గర్హనీయం . జీవ వైవిధ్యం దెబ్బ తింటుంది .  విచిత్రం ఏంటంటే పోలవరం పేరు చెప్పి గిరిజనులు కి అన్యాయం జరుగుతుంది అని చెప్పే ఈ "పెద్ద మనుషులు " ఈ మత మార్పిడులు మీద ఎందుకు ఇంత మౌనంగా ఉంటారు ?? ఇది ఎప్పటి నుండో నా బుర్రని తొలుస్తున్న ప్రశ్న .. ??

బిజెపి మాట్లాడాలి కాబట్టి ఒకె
కాంగ్రెస్ మాట్లాడకూడదు కాబట్టి ఓకే
కనీసం కమ్యూనిస్ట్ పార్టి లు అన్న మాట్లాడాలి కదా ??
మానవ హక్కుల వేదిక నాయకులూ అని చెప్పుకుంటూ తిరిగేవారన్న మాట్లాడాలి కదా ??
గిరిజనులకి క్రీస్తు బోధనలు అవసరమా ?? మళ్ళి వీళ్ళే దేశం మత అసహనం పెరిగిపోతుంది వీదుల్లో అరుస్తూ తిరుగుతూ ఉంటారు. 




పూర్వము ఆంధ్రజ్యోతి లో వచ్చిన ఒక వార్త లో కొంచెం  , వేరొక బ్లాగ్ నుండి తీసుకున్నాను .. పూర్తీ వ్యాసం త్వరలో అప్డేట్ చేస్తాను . 
___________________________________________________________

క్రైస్తవ మతాంతరీకరణం మన గిరిజన సంస్కృతుల పైన చావుదెబ్బ కొట్టింది. ఇది ఇంకా కొనసాగుతూనే వుంది. మన రాష్ట్రంలో 35 గిరిజన తెగలు ఉన్నాయి. తెలిసినవారు కూడా గిరిజనులను హిందువులుగా పరిగణిస్తారు. కాని ప్రతి గిరిజనతెగకు వారిదైన మతంవారికి ఉంటుం ది. వారి దేవుళ్ళు వారికి ఉన్నారు. ద్రావిడ భాషలు మాట్లాడే 27 గిరిజన తెగలకు విభిన్నమైన మత జీవనం ఉంది. వారి భాష ద్రావిడ భాష అయినా , తెలుగు లాగే అవి ఒకే భాషా కుటుంబానికి చెందినా వారి మతం వేరు, దేవుళ్లు వేరు. వారు మౌలికంగా హిందువులు కారు.

క్రైస్తవ మిషనరీలు చాలా కాలంగా ఈ తెగల వారిని లక్ష్యంగా చేసుకున్నా రు. వారి మతా న్ని మారుస్తూ వచ్చారు. గిరిజనుల నిత్య జీవన విధానానికి, మత అనుష్ఠానాలకు చాలా దగ్గర సంబంధం ఉంది. ప్రతి గిరిజన తెగకు వారిదైన న్యాయ వ్యవస్థ, వివాహ వ్యవస్థ ఉన్నాయి. వీటిని మన భారత రాజ్యాంగం, దేశ అత్యున్నత న్యాయస్థానం కూడా గౌరవిస్తున్నాయి. అయితే వీటిని క్రైస్తవ మతాంతరీకరణ విజయవంతంగా నాశనం చేయగలిగింది. ఇంకా చేస్తూనే ఉంది.

_____________________________________________________________

దయచేసి వీటిమీద మీ అభిప్రాయలు చెప్పండి , వీటికి వ్యతిరేఖంగా ఎవరన్న పోరాడుతున్నారా ?, వీలుంటే వాళ్ళ వివరాలు ఇవ్వండి , మనకి చేతనైన సహాయం చేద్దాం . 









Friday, November 6, 2015

మన్మోహన్ సింగ్ గారి కి కూడా ...

మన్మోహన్ సింగ్ గారి కి కూడా దేశం లో అసహనం కనిపించింది .

దెయ్యాలు వేదాలు వల్లించడం అంటే ఏంటో తెలుసా ??? ఇదిగో ఇదే ..

ఈ దేశం లో ముస్లిమ్స్ కి మాత్రమె దేశ  వనరులు మీద మొట్ట మొదటి అధికారం ఉంది అని చెప్పింది ఈయనే ..
ఇప్పుడు మతం వ్యక్తిగతం అని వేదాలు వల్లిస్తున్నారు ..

రాజశేకర్ రెడ్డి ముస్లిమ్స్ కి రిజర్వేషన్స్ ఇస్తానని చెప్పింది ఈయన హయాం లోనే ..
ఇప్పుడు మతం వ్యక్తిగతం అని వేదాలు వల్లిస్తున్నారు ..

కాషాయ టెర్రరిజం అని కొత్త పేరు తీసుకుని వచ్చింది  ఈయన పార్టి నే .. ఇస్లామిక్ టెర్రరిజం తో పోలీస్ లు చచ్చిపోతుంటే ..
ఇప్పుడు మతం వ్యకిగతం అని వేదాలు వల్లించడం ..

మత హింస వ్యతిరేఖ చట్టం వచ్చింది ఈయన హయాం లోనే , ఆ చట్టం ప్రకారం హిందువు లకి , క్రిస్టియన్ , ముస్లిమ్స్ కి మధ్య గొడవ రేగితే , మొదట హిందువు ల మీద కేసు పెడతారు .
ఇప్పుడు ఈ వేదాలు వల్లించడం ..

1984 సిక్కు గొడవల్లో సల్మాన్ కుర్షిద్ ని కోర్టు తప్పుబట్టినా ఏ విధమైన చర్య తీసుకోకుండా పార్టి లో అత్యున్నత స్థానం ఇచ్చింది ఈ పార్టి నే ..

బంగ్లాదేశ్ నుండి అస్సాం కి ముస్లిం ఇమిగ్రెంట్స ని తక్కువ చేసి చూపింది ఈ పార్టి నే ..

ఈ దేశం లో హిందువు లే అతి పెద్ద డేంజర్   రాహుల్ గాంధీ చెప్పినట్టు వికీ లీక్స్ లో వెల్లడైంది .





ప్రాబ్లం బిజెపి తో కాదు , ఎందుకంటే బిజెపి ప్రో-హిందూ అని అందరికి తెలిసిందే . 

మతం ప్రకారం రిజర్వేషన్స్, గ్రాంట్స్ ఇవ్వకూడదు అని బిజెపి ఎప్పటి నుండో వాదిస్తుంది . కాని ఈ కాంగ్రెస్ దేశాన్ని సంక నాకించడానికి కంకణం కట్టుకుని , జనాలని విడతీయడానికి , అధికారం కోసం దిగజారిపోతుంది . 





Tuesday, November 3, 2015

నిజంగా అసహనం పెరిగిపోతుందా ?

నిజంగా అసహనం పెరిగిపోతుందా ?

మన దేశాన్ని ఒక పధకం ప్రకారం degrade చేసే కుట్ర లా లేదు ఇది ? పెట్టుబడులు కోసం ఎదురు చూసే మన దేశం లో ఇది ఎంత ప్రమాదకరం . ( విదేశి పెట్టుబడులు లాభమా , నష్టమా అనేది వేరే టాపిక్ ).
ఈ హత్యలని ఖండించాలి , అంతే కాదు హంతకులకి ఉరిశిక్ష విధించినా నష్టం లేదు .

కర్ణాటక లో ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ .
ఉత్తరప్రదేశ్ లో ఉన్నది సమాజవాది పార్టీ .

ముంబై లో శివసేన ఎప్పటినుండో ఉంది . అంతే కాదు పాకిస్తాన్ కి వ్యతిరేఖంగా ప్రకటనలు చేయడం లో ఎప్పుడు ముందే ఉంటుంది . ముంబాయి నడిబోడ్డున పాకిస్తానీ టెర్రరిస్ట్ లు వచ్చి భీబత్సం స్ప్రుష్టించి నరమేధం చేస్తే .. ఇక్కడ మేధావులు ముసుగు వేసుకుని , లౌకికత్వం అని నల్ల తోలు కప్పుకుని ఒక పాకిస్తాన్ రచయత  పుస్తకావిష్కరణ చేస్తే సామాన్య జనం కడుపు రగిలిపొదా ?.  అది కావాలనే చేసినట్టు అనిపించడం లేదా ? ముంబాయి లో తమని కాదని బిజెపి ఒంటరిగా పోటీ చేయడం కూడా శివసేన కి మండిపోతుంది .
    చార్లెస్ హేబ్దో ఎటాక్ జరిగినప్పుడు ఈ మేధావులు (?) ఏం మాట్లాడారు ,  అవతలి వాళ్ళ సెంటిమెంట్స్ గౌరవిన్చాలంట అని , మత నమ్మకాలని అవమానించే అర్హత లేదు అని ..  మరి కల్బుర్గి చెప్పింది ఏంటి ?? హిందూ దేవుళ్ళ విగ్రహాల మీద ఉచ్చ పోస్తానని.. .మరి ఈ గొంతులు ఏమయిపోయాయి ,అరిచి అరిచి బొంగురుపోయాయా  ?


--ముస్లిమ్స్ కి మాత్రమె ఈ దేశం వనరుల మీద ఆధిపత్యం ఉంది అని మన్మోహన్ గారు చెప్పినప్పుడు , మిగతా మతాలలో అసహనం పెరిగిపోలేదా ?? అప్పుడు ఈ మేధావులు ( ??) కి గుర్తుకు రాలేదా ఈ అసహనం . 
--గోద్రా రైలు ని తగలపెట్టి నప్పుడు గుర్తుకు రాలేదా ఈ మేధావులకి ( ??) అసహనం . 
--కేరళ లో ఒక ప్రొఫెసర్ చేయిని ఒక వర్గం వారు  అమానుషంగా నరికేసినప్పుడు గుర్తుకురాలేదా ఈ అసహనం .
--ఎం ఐ ఎం  తస్లిమా నస్రీన్ ని జుట్టు పట్టుకుని హైదరాబాద్ నడిబొడ్డున తన్నినప్పుడు , ఈ మేధావులు అని చెప్పుకుంటున్న వాళ్ళంతా ఏ కలుగులో దాక్కున్నారు ??

ఈ వామపక్ష బుద్ది  ఇంకా ఎన్నాళ్ళు ?? 

బిజెపి అధికారం లోకి వచ్చిన దగ్గర నుండి , హిందువు లని మాత్రమె  మతవాదులు గా ముద్ర వేయడం లో ఈ కుట్ర ఏంటి ?? అంతకు ముందు జరగలేదా ? సిక్కుల ఊచకోత లో ఇప్పటకి మానని గాయాలే ..  

ఇలాంటి సెలెక్టివ్ గా నిరసన తెలపడం లో పరమార్ధం ఏంటి ? .  ఇప్పుడు ఉన్న సామాజిక వెబ్సైటు ల వల్ల  చిన్న విషయం కూడా అతి త్వరగా ఆవల గట్టుకి చేరిపోతుంది , అలాంటిది ఈ మేధావులు చేసే సెలెక్టివ్ నిరసన తెలియదా ? ఇలానే కాంగ్రెస్ చేసి , హిందూ వోట్లు అన్ని polarize అవ్వడానికి దోహదపడ్డాది . 

తస్లిమా నస్రీన్ చెప్పినట్టు ,  ఈ దేశం లో సెక్యులర్ అని పిలిపించుకోవాలంటే  అంటే హిందూ మతానికి వ్యతిరేఖంగా మాట్లాడాలి 








Tuesday, September 22, 2015

2011 లో జరిగిన విషయాన్ని ఏదో నిన్న, మొన్న జరిగినట్టు రాసి పారేశారు మన సాక్షి జర్నలిస్ట్ లు

ఈసారి కూడా సాక్షి నే ..
పాత చచ్చు పుచ్చు న్యూస్ చదవాలనుకుంటే సాక్షి ఓపెన్ చేయండి .
2011 లో జరిగిన విషయాన్ని ఏదో నిన్న, మొన్న జరిగినట్టు రాసి పారేశారు మన సాక్షి జర్నలిస్ట్ లు .
ఇంతకు ముందు కూడా , పాకిస్తాన్ ఇమ్రాన్  ఖాన్ కి బదులు బాలివుడ్ ఇమ్రాన్ ఖాన్ ఫోటో పెట్టిన విషయం ఈ బ్లాగ్ లో చూడొచ్చు .

ఒక విమానం ముందు చక్రం లేకుండా ల్యాండ్ అవ్వడం ఎంత పెద్ద న్యూస్ . అది ఈరోజే జరిగినట్టు రాయడం ఇంకా పెద్ద న్యూస్ .



ఆ మొదటి లైన్ చూసారా , ఇరాన్ విమానం ఘోర ప్రమాదం నుండి బయట పడిందంట ఎప్పుడూ ??? 2011 లో :-)  ఆ న్యూస్ లో ఇచ్చిన లింక్ కూడా పాతదే , ఆ లింక్ ఇక్కడ . డైరెక్ట్ youtube వీడియో రావడం లేదు దీనికి . 




అదన్న మాట సంగతి . అంటే మనకన్నా 4 సంవత్సరాలు లేట్ గా ఉన్నారు సాక్షి . 




Monday, September 21, 2015

రిజర్వేషన్స్ రివ్యూ చేయాలనీ వాదిస్తే చంపేస్తామని బెదిరిస్తారా

ఖచ్చితంగా చేయాల్సిందే , ఈ డిమాండ్ రిజర్వేషన్స్ తీసేయమని కాదు . దాన్ని ఒక వోట్ బ్యాంకు గా కాకుండా వెనకబడిన వర్గాలకి నిజంగా మేలు చేసే విధంగా మార్చాల్సిందే .

దానితో లాభపడ్డ జనాలు , వాళ్ళ వర్గం లో ఎంతమంది ని పైకి తీసుకుని రావడానికి కృషి చేసారో చెప్పగలరా ?
రిజర్వేషన్స్ లో పైకి ఎదిగి , తన వాళ్లకి చేయూత ఇవ్వకపోవడాన్ని ప్రశ్నిస్తే , మనం మీద కుల దూషణ కేసు లు పెడతారంట .

విచిత్రం ఏంటంటే ... ఈ రిజర్వేషన్స్ గురించి మాట్లాడితే, ఒంటి కాలు మీద లేచి బూతులు తిట్టేది ఎవరో తెలుసా
క్రైస్తవ మతం లోకి మారిన జనాలు . అవును . హిందూ మతం లో ఉన్న ( ఉన్నారో లేదో తెలియదు ) వెనకబడిన వర్గాలు ఈ విషయం లో తక్కువ గా వ్యతిరేఖత చూపిస్తున్నారు , కాని మతం మారిన జనం మాత్రం రిజర్వేషన్స్ ముట్టుకుంటే బ్రహ్మాండం బద్దలు అవుతుంది అన్నట్టు బెదిరిస్తున్నారు .
ఫేస్బుక్ లలో ఐతే, చంపేస్తామని బెదిరిస్తున్నారు , కొన్ని గ్రూప్ లలో చూసాను.

హిందూ మతానికే పరిమితమైన ఈ జాడ్యం ( కులం ) లో నుండి సమానత్వాన్ని కోరుకుంటూ వెళ్ళిపోయినా జనాలు , ఈ రిజర్వేషన్స్ ని కోరడం , దాని కోసం బెదిరించడం ఎంత వరకు సమంజసమొ వాళ్ళకే తెలియాలి .

మీకు తెలిసిన ఫేస్బుక్ లో కాని, మరే ఇతర సోషల్ నెట్వర్క్ లో , ఇలా బెదిరించే లింక్ లు , స్క్రీన్ షాట్ లు , కామెంట్ లో పెట్టండి .

నాకెందుకో వీళ్ళ వెనక ఉండేది ఎవరో కొంచెం లీల గా అర్ధం అవుతుంది , మీకు తెలిసిన చెప్పకండి :-)



Friday, September 18, 2015

పండుగ లు వృధా అని వాదించే జనం కోసం ఈ రోజు ఆంధ్రజ్యోతి ఎడిటోరియల్ లో ..

పండుగ లు వృధా అని వాదించే జనం కోసం ఈ రోజు ఆంధ్రజ్యోతి ఎడిటోరియల్ లో ..
కుల మతాలతో సంబంధం లేకుండా ..






Tuesday, September 15, 2015

ఈ సెప్టెంబర్ 17 మన కెసిఆర్ ఏం చేస్తారో చూద్దాం


ఈ రోజు న్యూస్ చదువుతుంటే , యదా ప్రకారం , హాట్ న్యూస్ ఏంటంటే సెప్టెంబర్ 17 .
హైదరాబాద్ విమోచన గురించి అంత లోతైన సమాచారం నాకు తెలియదు , కాని కెసిఆర్ మాత్రం
అప్పట్లో ప్రభుత్వాలని ఒక ఆట ఆడుకున్నట్టు బాగా గుర్తు .

మనకి స్వాతంత్ర్యం వచ్చింది ఆగుస్ట్ 15 న కాదు , సెప్టెంబర్ 17 అని గొంతెత్తి నినాదాలు చేసారు .



అప్పటి ప్రభుత్వాలు పాపం కక్కలేక మింగలేక తెగ ఇబ్బంది పడ్డాయి .
ఇప్పుడు మన కెసిఆర్ ఏం చేస్తారో చూద్దాం , అందరిలానే తప్పించుకుని పారిపోతారో , లేక ధైర్యంగా విమోచన దినాన్ని అధికారికంగా చేస్తారో . ??

నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే  , కెసిఆర్ ఖచ్చితంగా చేస్తారు అని , పారిపోయే మనస్తత్వం కాదు అని అనిపిస్తుంది .

Thursday, September 10, 2015

జర్మనీ లో సిరియా శరణార్దుల కోసం మసీదు లు కట్టడానికి సౌదీ అరేబియా బారీ విరాళం


అవును , మీరు చదివింది కరెక్ట్ ....
ఒక్క శరణార్ది ని కూడా తమ దేశం లో అనుమతించని సౌదీ అరేబియా , జర్మనీ వెళ్తున్న సిరియా శరణార్దుల కోసం
200 మసీదులు కట్టడానికి విరాళం ఇవ్వబోతుంది .

https://www.frontpagemag.com/point/260080/saudi-arabia-offers-build-200-mosques-syrians-daniel-greenfield





http://www.arabianbusiness.com/saudi-offers-build-200-mosques-in-germany-for-syrian-refugees-605755.html


ఇది అనుమానం కాదు, మీరు గూగుల్ చేసి చూస్తె నిజమని తేలింది .

అత్యంత ధనిక దేశాలు అయినా , ఈ మిడిల్ ఈస్ట్ దేశాలు ఒక్క శరణార్ది ని కూడా తమ దేశం లోకి అనుమతించకపోవడం ఎంత అమానవీయం , అత్యంత హేయమైన చర్య ఇది .

ఇసిస్ ఉగ్రవాదుల దాడులు , అత్యాచారాలు తట్టుకోలేక , చిన్న పిల్లలని కూడా చెరచి , బానిసలు గా అమ్మేసే హేయమైన ఆ ఉగ్రవాదులు నుండి సముద్రాలు దాటి యూరోప్ కి వెళ్తున్నారు కాని పక్కనే ఉన్న మిగత అరబ్ దేశాలకి మాత్రం వాళ్లకి అనుమతి లేదు .
నిజం చెప్పాలంటే, సిరియా , ఇరాక్ , శరణార్దులు ని ఆడుకోవడానికి గల్ఫ్ దేశాలు కి చాలా అవకాశాలు ఉన్నాయి , ఒకటే మతం అవ్వడం వల్ల , తోటి సహచరులు అన్న ఉద్దేశ్యం కూడా ఉండాలి  , కాని ఇప్పుడు మౌనంగా ఉన్నాయి .

ఇప్పుడు జర్మనీ లో ఉన్న శరణార్దులు ఎక్కడ తమ మతం మార్చుకుంటారేమో అని , సౌదీ అరేబియా ప్రతీ వంద మంది సిరియన్ లకి ఒక మసీదు నిర్మిస్తుంది , తమ దేశం లో ఒక్క చర్చి కి కూడా అనుమతి ఇవ్వని దేశం .

ఈ వలసలు యూరోప్ ని ఇస్లామీకరణ చేసే పధకం లో ఒక భాగం అని , గల్ఫ్ దేశాలు రహస్యంగా అమలు చేస్తున్న పధకం లో భాగమే ఇది అని వార్తలు వినిపిస్తున్నాయి . మనుషలని చేరవేసే వ్యక్తులు , యూరోప్ కి వెళ్ళమని బలవంతం చేయడం కూడా అనుమానాలు బలపడుతున్నాయి .

ఈ సంవత్సరం , పది లక్షలు మంది యూరోప్ లోకి వస్తారని అంచనా వేస్తున్నారు .  మనవ హక్కుల కి అత్యంత ప్రాముఖ్యత ఇచ్చే యూరోప్ దేశాలలో ఇస్లాం ని వ్యాప్తి చేయడం సులభం అని గ్రహించి ఈ ఆగడాల కి పాల్పడుతున్నట్టు కొన్ని వెబ్ పత్రికల కధనం .



Thursday, August 27, 2015

పాకిస్తాన్ టిట్ ఫర్ టాట్

జమ్మూ కాశ్మీర్ లో టెర్రరిస్ట్ ని పట్టుకున్న వార్త రాగానే  , పాకిస్తాన్ చేసిన పని ఏంటో తెలుసా .. వాళ్ళు కూడా ఇండియన్ టెర్రరిస్ట్ ని పట్టుకున్నామని ప్రకటించారు .
:) :)

ఈ కింద ఉన్నది కాశ్మీర్ లో పట్టుకున్న పాకిస్తాన్ ఇస్లామిక్ టెర్రరిస్ట్
http://www.ndtv.com/india-news/pakistani-terrorist-caught-alive-after-encounter-in-north-kashmir-1211556?pfrom=home-lateststories

ఈ కింద న్యూస్ చదవండి ..

http://www.dawn.com/news/1203185/muharram-terror-bid-foiled-as-four-raw-linked-men-arrested-from-karachi-ssp



కామెడీ ... 

Wednesday, August 19, 2015

జాతీయ గీతం పాడితే బడి నుండి తొలగిస్తాం

జమ్మూ కాశ్మీర్ లో మన దేశ జాతీయ గీతం పాడే స్వేచ్చ కూడా లేకుండా పోయింది



. ఈ కుహానా లౌకిక వాదులు ఎక్కడ దాక్కున్నారో ??
ఏది ఏమైనా, ఈ కుహానా లౌకిక వాదులు నుండి , టెర్రరిస్ట్ ల నుండి జమ్మూ కాశ్మీర్ కి స్వతంత్రం వస్తుందని ఆశిస్తూ ..

Sunday, August 9, 2015

కేంద్రం తో గొడవ పడితే ప్రత్యెక హోదా వచ్చేస్తుందా ??

కేంద్రం తో గొడవ పడితే ప్రత్యెక హోదా వచ్చేస్తుందా ?

గత కొన్ని రోజులు గా సాక్షి, ఇతర కాంగ్రెస్ ( ? ) నాయకులు తెగ ఉదరగోడతుంటే డౌట్ వస్తుంది .
ఇప్పుడు జగన్ అయినా,  చంద్రబాబు నాయుడు అయినా ఏమి పీకలేరు  , బిజెపి ఈక కూడా తెమ్పలేము .
బిజెపి కి పూర్తీ మెజారిటి ఉంది , ఆంధ్రప్రదేశ్ లో చెప్పుకోదగ్గ బలం కూడా లేదు ఓడిపోతామేమో అని అనుకోవడానికి . ఎక్కువగా మాట్లాడితే ఉంచుకున్నవి కూడా పోతాయి .

మూసుకుని కూర్చోవడమే , లేకపోతె జగన్ ని బయటకి తీసుకుని రావడానికి బిజెపి కి బుర్ర లేదా ?
వీడు కాకపోతే వాడు , అంతే .

ఔరా , ఇదెలా సాద్యం

బిజెపి పాలన లో , స్వచ్చ భారత్ లో కాంగ్రెస్ పాలిత ప్రాంతాలు మొదటి స్థానాలలో ఉండటం . 
ఇంత నిష్పక్షపాతంగా పరిపాలిస్తే ఎలా ?? 
బిజెపి పాలనలో బిజెపి పాలిత రాష్ట్రాలు , కాంగ్రెస్ పాలన లో కాంగ్రెస్ పాలిత ప్రాంతాలు మాత్రమె రావాలి , అది మన సంప్రదాయం కదా . 


Friday, August 7, 2015

కాలనీ లలో, గేటెడ్ కమ్యూనిటీస్ లో చెత్త నుండి ఎరువు తయారు చేసుకోవడం

ఈ రోజు వసుంధర లో వచ్చింది .. బాగుంది ఈ ఆర్టికల్ .

ఈ రోజుల్లో ఎక్కడ చూసిన చెత్త ఒక పెద్ద సమస్య అయిపోతుంది . నిజం చెప్పాలంటే సగం రోగాలికి పరిసరాలు అపరిశుభ్రతే కారణం . చెత్త అంతా సేకరించి ఇంకో చోటకి తరలించడం పెద్ద సమస్య .
చెత్త ని రీసైక్లింగ్ చేస్తే , తొంబై శాతం సమస్యలు పరిష్కారం అయిపోతాయి .

ఈ ఆర్టికల్ లో చెత్త నుండి ఎరువు తీసే యంత్రాల గురించి , అవి సప్లై చేసే సంస్థ గురించి వచ్చిన ఆర్టికల్ .
అలా తీసిన ఎరువు ని కొంతమంది తిరిగి అమ్ముతున్నారంతా కూడా .









Tuesday, August 4, 2015

కంపెనీ లో ప్రతీ ఒక్కరికి సమాన జీతం ఇస్తామన్న కంపెనీ భవిష్యత్తు ఏమైందో ???

గ్రావిటీ పేమెంట్ అని ఒక అమెరికన్ కంపెనీ సీఈఓ , గత ఏప్రిల్ లో ఒక ప్రకటన చేసారు ..
కంపెనీ లో పని చేస్తున్న ప్రతీ ఒక్కరికి సమాన జీతం ఇస్తామని , ప్రతీ ఒక్కరికి అంటే ప్రతీ ఒక్కరికి .
కింద స్తాయి నుండి , పై స్తాయి వరకు అందరికి ఒకటే జీతం . సంవత్సరానికి 70, 000 డాలర్స్ .
తక్కువ స్కిల్ ఉన్నవాళ్ళకి, ఎక్కువ స్కిల్ ఉన్నవాళ్ళకి కూడా ఒకటే జీతం .

ఆ కంపెనీ భవిష్యత్తు ఏమైందో, తెలుసుకోవాలంటే ఈ కింద ఉన్న లింక్ లు చదవండి .


http://www.youngcons.com/ceo-raises-salaries-to-70k-for-every-employee-now-has-to-rent-his-own-home-to-make-ends-meet/



http://www.forbes.com/sites/davidburkus/2015/08/02/why-a-70000-minimum-salaries-isnt-enough-for-gravity-payments/



నిజంగా ఒక మంచి కేసు స్టడీ .  

Thursday, July 30, 2015

టెర్రరిస్ట్ లకి మతానికి ఏం సంబంధం

టెర్రరిస్ట్ లకి మతానికి ఏం సంబంధం ..

ఎక్కడైనా ఒక టెర్రరిస్ట్ ఎటాక్ జరిగినప్పుడు , పదుల సఖ్యలో జనం చనిపోయినప్పుడు ..
మనం వినే ఒకే మాట ..
"ఉగ్రవాదు లుకి మతం తో సంబంధం లేదు.  ఉగ్రవాదానికి మతానికి సంబంధం లేదు . "
సరే అలానే అనుకుందాం .. ఇప్పుడు యెమెన్ కి ఉరిశిక్ష విధిస్తే .. వినిపిస్తున్న మాట ..
"అతను ముస్లిం కాబట్టి ఉరిశిక్ష విధించారు " 
 సామాజిక మాధ్యమాల్లో జరిగే చర్చ ని మీరు చూసే ఉంటారు .
ఆ మేధావులు కి, మానవ హక్కుల కోసం పోరాడే వ్యక్తులకి , ఏం ఐ ఏం కి , దళిత నాయకులకి  -- మీరు మరీ ఇంత దారుణంగా నాలుక మడత పెట్టి మాట్లాడటం ఏం బాగుంది . ఇంత విరుద్దమైన మాటలు మాట్లాడుతూ ఉంటె , రేపు మీ మాటలు జనం ఏం నమ్ముతారు  ?? మీ లక్ష్యాన్ని జనం ఏ విధంగా అర్ధం చేసుకుంటారు .

యెమెన్ కి , దళిత వాదానికి సంబంధం ఏంటి ? ఫేస్బుక్ లో కొంతమంది దళిత నాయకులు అని చెప్పుకుంటూ సాగించే ఈ ప్రచారం ఖండించాలి .



Friday, July 17, 2015

చిన్నపిల్లలు హత్యలు చేస్తే ఎలా ఉంటుంది



పది సంవత్సరాల వయసు గల పిల్లలు , హత్య చేస్తే ఎలా ఉంటుందో చూడాలంటే మనం ఇస్లామిక్ స్టేట్ కి వెల్లల్సిన్దె.
ఇది లింక్ ఇక్కడ ఉంది .
http://www.dailymail.co.uk/news/article-3164999/ISIS-film-CHILD-carrying-beheading-time-Cub-Caliphate-seen-executing-prisoner-decapitation-terror-group-increasingly-use-boys-kill.html





Sunday, July 5, 2015

గ్రీసు దివాలా తీయడానికి గల కారణం సోషలిజమా ??

గ్రీసు దివాలా తీయడానికి గల కారణం సోషలిజమా ..

గ్రీసు గురించి , గత వారం రోజులు నుండి జరిగే పరిణామాల గురించి మీకు అందరికి తెలిసే ఉంటుంది .
కాకపోతే గ్రీసు ఎందుకు దివాలా తీసింది అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం .

ఈ లింక్ చూడండి . గ్రీసు లో బార్బర్ పని ప్రమాదకరమైన ఉద్యోగం అంట , ఎందుకో మీరే చదవండి  .

http://shankhnaad.net/world/economy/item/298-greeks-have-run-out-of-other-people-s-money


Saturday, June 27, 2015

ట్యునీషియా లో టూరిస్ట్ లని అత్యంత పాశవికంగా కాల్చిన ఇస్లామిక్ ఉగ్రవాది


ట్యునీషియా లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాది , బీచ్ లో సేద తీరుతున్న పర్యాటకులని అత్యంత దగ్గరగా కాల్చి చంపినా ఘటన లో 38 మంది చనిపోయారు .
టూరిస్ట్ లని చంపి , తిరిగి వీధుల్లో మిగిలిన టూరిస్ట్ లని చంపడానికి వెతుకుతున్న క్రమం లో పోలీస్ తూటా లని బలి అయిపోయాడు .

డైలీ మెయిల్ నుండి కొన్ని ఫోటో లు . .

ఆ ఉగ్రవాది ఫోటో ఇక్కడ

AK47 తో ఉగ్రవాది


తన వాళ్ళు చనిపోయిన బాధ లో ఒక మహిళ


వీధుల్లో మిగతా టూరిస్ట్ ల కోసం  వెతుకుతున్న ఉగ్రవాది ..





పోలీస్ లు కాల్చిచంపిన ఉగ్రవాది


చనిపోయిన వ్యక్తుల ఫోటో లు ..





ఒకప్పుడు ఉగ్రవాదులు ఏ దేశాల్లో ఉంటారు అని అడిగితె , పలానా అని చెప్పేవాళ్ళం .
ఇప్పుడు ప్రపంచం అంతా వాళ్ళే ఉన్నట్టు అనిపిస్తుంది . అంతగా ఉగ్రవాదం విస్తరిస్తుంది .
ఒకప్పుడు పేదరికం కారణంగానో , మరే ఇతర కారణాలతో ఉగ్రవాదులు గా తయారయ్యేవాళ్ళు .
అభివృద్ధి చెందిన దేశాల నుండి , ఆరోగ్యకరమైన జీవితం , భద్రత ఉన్న బ్రిటన్ , ఆస్ట్రేలియా , యూరోప్  జీవితాన్ని కూడా వదులుకుని , ఇస్లామిక్ స్టేట్ లో జాయిన్ అవుతున్న ఉగ్రవాదులు ని చూస్తుంటే మన అభిప్రాయాలు మార్చుకోవాలేమో .. 

Wednesday, June 24, 2015

ఎవరీవిడా ..

సెక్షన్ 8 పెట్టడానికి నేను చచ్చినా ఒప్పుకోను , ఈ విషయం లో  కేంద్రం మొండిగా ముందు కి వెళితే యుద్దమే ..

ఎవరీవిడా .. ??

విజయశాంతి

విజయశాంతా ?? ఆవిడెవరు ??

మా చిన్నప్పుడు చాలా గొప్ప నటి , చాలా సినిమాల్లో ఉతికి ఆరేసింది , ఇప్పుడు ఇదిగో ఇదే చూట్టం ..

చా నిజమా ??

అందుకే రోజూ కనీసం ఒక పది నిమిషాలైన పేపర్ చదవమనేది .. చదివుంటే ఆవిడ ఎంత పెద్ద నటో అర్ధమయ్యేది . .


Tuesday, June 23, 2015

బాబు ఎర్ర బ్లాగర్లు , కాస్తా ఆ చైనా కి చెప్పి పుణ్యం కట్టుకొండయ్య

బాబు ఎర్ర బ్లాగర్లు  , కాస్తా ఆ చైనా కి చెప్పి పుణ్యం కట్టుకొండయ్య




http://www.ndtv.com/india-news/china-protects-pakistan-at-un-over-26-11-masterminds-release-pm-narendra-modi-objects-774585?pfrom=home-lateststories



కుక్కలు కూడా ఒళ్ళు విరుచుకుంటాయి , అంత మాత్రానా అవి యోగా చేస్తున్నట్టా

కుక్కలు కూడా ఒళ్ళు విరుచుకుంటాయి , అంత మాత్రానా అవి యోగా చేస్తున్నట్టా ... ఇవి నా మాటలు కాదు ,
మన తెలుగు వాడే , ఏచూరి గారి మాటలు .



Monday, April 6, 2015

కోచి లో పది అడుగుల కి పది వేలు అడిగిన కేరళా కూలి లు , కోపం తో తన ఆర్ట్స్ ని తనే ద్వంసం చేసుకున్న అమెరికన్ ఆర్టిస్ట్


కోచి లో పది అడుగుల కి పది వేలు అడిగిన కేరళా కూలి లు , కోపం తో తన ఆర్ట్స్ ని తనే ద్వంసం చేసుకున్న అమెరికన్ ఆర్టిస్ట్ :

మీకు అందరికి తెలిసిందే .. దేవుడి సొంత భూమి ని చాలా సంవత్సరాలు కమ్యూనిస్ట్ లు పరిపాలిస్తున్నారు .
మీకు తెలియని విషయం ఏంటంటే అక్కడ లేబర్ అసోసియేషన్స్ చాలా దారుణాతి దారుణంగా ఉంటాయి . గూండాలకి తక్కువ గా  రౌడీ లకి ఎక్కువగా ..

ఈ మధ్యన కేరళ రాష్ట్రం లో జరిగిన ఒక ఆర్ట్ ఫెస్టివల్ కి అమెరికా నుండి చిత్రకారుడు Waswo X Waswo కూడా ఫోల్గొన్నారు .  తన వస్తువులని ( కేవలం ఆరు పెట్టెలు )  ప్రదర్సన జరిగిన స్థలం నుండి ట్రక్ లోకి తీసుకుని వెళ్ళడానికి  ,( కేవలం పదే పది అడుగులు )  అక్కడ కూలి లు అడిగింది డబ్బై , అరవై వేలు . 
అంటే ఇంట్లో నుండి వస్తువులు  తెచ్చి , లారి లో పెట్టడం . దానికి అంత ఎక్కువగా అడగడం తో విస్తుపోయినా ఆయన వాళ్ళతో బేరం ఆడటానికి ప్రయత్నించారు, కాని  బేరం కనీస మొత్తం పది వేలు నుండి ప్రారభించాలని లేబర్ అసోసియేషన్ కోరడం తో నోటి మాట రాక , కోపం తో తన వస్తువు లన్ని తనే నాశనం చేసేసుకున్నాడు . 

http://www.mouthshut.com/blog/jhihnststm/Watch-Video-Angry-over-Kerala-trade-unions-US-artist-destroys-his-creations

వాళ్ళని కాకుండా వేరే ఎవరిని సహాయం చేయనియ్యరు . అందువలన అతనికి వేరే సహాయం లేక, నిస్సహాయుడై అతని శ్రమ ని అతనే నాశనం చేసుకోవలసి వచ్చింది . అక్కడ ట్రేడ్ యూనియన్స్ చాలా బలంగా ఉంటాయి , చాలా వరకు కమ్యూనిస్ట్ పార్టి లకి అనుబంధ సంఘాలు గా ఉంటాయి .

ఈ వీడియో చూడండి 




నా స్నేహితుడు , మలయాళీ మాటల్లో ,  వాళ్ళ కుటుంబం గుజరాత్ లో స్థిరపడింది , వాళ్ళ నాన్న రిటైర్ అయిన తరువాత , సొంత రాష్ట్రం లో స్థిరపడాలని , మొత్తం సామాను లారి లో లోడ్ చేసి, కేరళ తీసుకుని వెళ్ళారు .
అక్కడ ఆ సామాను దించడానికి కూలి లు వేలల్లో అడిగారంట , ఇది చెప్పినప్పుడు నేను నమ్మలేదు , మరీ అంత దారుణంగా ఎవరు అడుగుతారు , కాని నా స్నేహితుడు చెప్పిన దాని ప్రకారం అక్కడ ఎవరు ఎదిరించి మాట్లాడలేరు . వాళ్ళని కాదంటే మీరు ఇంకొకరిని తేచ్చుకోలేరు . స్నేహితులు సహాయం తో అతి కష్టం మీద ఆయన ఆ సామాను దిన్చుకున్నారు .
వంద శాతం అక్షరాస్యత అంటూ ఎన్ని సంవత్సరాలు ప్రచారం చేసుకుంటారో ఆ ప్రభుత్వం . అది తప్ప ఇంకో achievement వినలేదు నేను .

ఐ ఫీల్ సో సారీ ఫర్ హిం . పరాయి దేశం వాళ్ళ దగ్గర పరువు తీసే మన జనాలకి ఎప్పుడు బుద్ది వస్తుందో . కనీసం విదేశీయుల దగ్గర అయినా మన పరువు తీయకుండా ఉంటె మనం ఘనంగా చెప్పుకునే అతిధి దేవో భావ అన్న మాటకి కొంచెం అయినా విలువ ఉంటుంది .


Monday, February 16, 2015

21 మంది క్రైస్తవుల తలలు నరికిన ఐస్ఐస్ ఇస్లామిక్ ఉగ్రవాదులు

21 మంది ఈజిప్ట్ క్రైస్తవుల తలల్ని అత్యంత పాశవికంగా నరికేసిన ఇస్లామిక్ ఉగ్రవాదులు . ఈజిప్ట్ నుండి లిబియ కి పని కోసం వెళ్ళిన 21 మంది క్రైస్తవులని అత్యంత పాశవికంగా నరికేసారు , దానిని వీడియో తీసి ఇంటర్నెట్ లో పెట్టారు . 

ఆ 21 మంది చేసిన నేరం ఏంటంటే , వాళ్ళు ముస్లిమ్స్ కాకపోవడమే . 





రక్తం తో తడిసిన సముద్ర తీరం 


ఫొటోస్ : డైలీ మెయిల్ , ఆంధ్రజ్యోతి . 



ఇస్లామిక్ ఉగ్రవాదులు ఒక జోర్డాన్ పైలట్ ని సజీవ దహనం చేసిన విషయం మీకు తెలుసు . ఆ వీడియో ఈ క్రింద వెబ్సైటు లింక్ లో ఉంది . 

http://shoebat.com/2015/02/03/watch-horrific-video-isis-burning-pow-jordanian-pilot/

దయచేసి ఆ వీడియో చూసే ముందు మీ గుండెలుని గట్టిగా పట్టుకోండి, చూడలేము అనుకున్న వాళ్ళు లింక్ అస్సలు ఓపెన్ చేయొద్దు , వీడియో , ఫోటో లు , చాలా దారుణంగా ఉన్నాయి , మీరు సున్నిత మనస్కులైతే ఓపెన్ చేయొద్దని మరీ మరీ హెచ్చరిస్తున్నాను .