Sunday, December 13, 2015

తెలుగు చిత్ర పరిశ్రమ దౌర్భాగ్యం ..

మన తెలుగు చిత్ర పరిశ్రమ కి ఒక అసోసియేషన్ ఉంది , దానికి ప్రెసిడెంట్ , సెక్రటరీ లాంటి వారు ఉన్నారు .
అయినా మా (MAA) కి వైస్ ప్రెసిడెంట్ అయి ఉండి కూడా , తన సొంతంగా "మన మద్రాస్" పేరుతొ కార్యక్రమం పెట్టడం లో మన లక్ష్మక్క ఔచిత్యమ్ ఏంటో అర్ధం కావడం లేదు . 
పాపం రాజేంద్రప్రసాద్ ఏదో ముళ్ళ కిరీటం లా భరిస్తున్నాడు . పోటి లోకి దిగిన తరువాత వెనక్కి వెళ్ళలేక  అహం అడ్డొచ్చి నిలబడ్డాడు , అప్పటకి టీవీ9 లో చెప్పాడు, ముందే నాతో చెప్పి ఉంటె నేను పోటి లో ఉండేవాడిని కాదు అని .
మురళి మోహన్, మోహన్ బాబు , సీనియర్ నరేష్  , అలీ అంతా వెన్నుపోటు పొడిచారు . శివాజీరాజ వాపోయాడు అలీ ముందు నాతో చెప్పలేదు అని .

తెలుగు చిత్ర పరిశ్రమ అంత కలిసి చేయడం ఒకటి , ఇలా ఎవరికి వారు చేసుకోవడం ఒకటి . MAA కి వైస్ ప్రెసిడెంట్ హోదాలో ఉండి కూడా లక్ష్మక్క ఇలాంటివి ప్రోత్సహించడం గర్హనీయం .

No comments:

Post a Comment