Wednesday, March 22, 2017

కేవలం దేవుడు లేదు అన్నందుకు వెంటాడి వెంటాడి చంపేస్తారా ?? ప్రజాస్వామ్యవాదులు , టీవీలలో గొంతేత్త్తి అరిచే నేతలు ఎక్కడ

దేవుడు ఉనికి గురించి ప్రశ్నిస్తే చంపేస్తారా ?

మనిషి తన జ్ఞానాన్ని , తనని తానూ అభివృద్ధి చెందడానికి కారణం ఒకే ఒకటి అదే "ప్రశ్నించడం" .

ప్రశ్నించడం ద్వారానే మనిషి ఎన్నో నేర్చుకుంటాడు , పుట్టిన దగ్గర నుండి చనిపోయే వరకు వివిధ సందర్భాలలో మనిషి ప్రశ్నిస్తూనే ఉంటాడు .

క్లాస్ లో టీచర్ ప్రశ్నించమని విద్యార్థులని ప్రోత్సహిస్తారు . ప్రభుత్వాన్ని ప్రశ్నించమని ప్రతిపక్షాలు , ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ?


ఈ రోజు ఆ విధంగా ఒక వ్యక్తి దేవుని ఉనికి ని ప్రశ్నించినందుకు ఒక వ్యక్తి ని అత్యంత దారుణంగా నరికి చంపేశారు .  కానీ దీని గురించి ప్రశ్నించే నాధుడే లేదు . బహుశా అటువంటి గతే మాకు పడుతుందేమో అన్న భయం అయి ఉండొచ్చూ .  ఫేస్బుక్ లో  వీర ప్రజాస్వామ్యవాదులు , ప్రగతివాదులు అంటూ రొమ్ము విరిచి మాట్లాడే జనాలు కూడా  తెలియనట్టు నటిస్తూ తమ అలవాటైన ధోరణి లో బిజెపి ని విమర్శించుకుంటూ పోస్ట్ లు పెట్టుకుంటున్నారు .





ఒకసారి జాగ్రత్త్తగా ఈ సో కాల్డ్ ప్రజాస్వామ్యవాదులు ని గమనించమని చెప్తున్నాను .
వాళ్ళ డొల్ల వాదనా , సెలెక్టివ్ గా ఒకే మతాన్ని టార్గెట్ చేయడం బాగా గమనించండి.
కనీసం ఒక్కరు కూడా దీనిని ఖండించకపోవడాన్ని బాగా గమనించండి .
అదే హిందూ మతం లో జరిగితే ఈ పాటికి జరిగే రచ్చ ఎలా ఉంటుందో మీకు తెలుసు .
 ప్రశ్నించే అవకాశం లేని  మతం మతమే కాదు ,  


2 comments:

  1. >>అదే హిందూ మతం లో జరిగితే

    ఈ పాటికి వాడు ముఖ్యమంత్రి(యుపి)/ప్రధాన మంత్రి ఐవుండేవాడు. సైకో బచ్చి అంతా వాడికి పొర్లు దండాలు పెడుతుండేవాళ్ళు

    ReplyDelete
  2. ప్రశ్నించే అవకాశం లేని మతం మతమే కాదన్న మాట బాగుంది.

    మతవిశ్వాసాలను ప్రశ్నించే అవకాశం సనాతనధర్మంలో ఉన్నంతగా మరెక్కడా లేదు. రామాయణంలో జాబాలి మహర్షి రాముడితో కొంత హేతువాదం చేస్తాడు. అది రాముడి హృదయాన్ని పరిశీలించేందుకు. హేతువాదం చేసినంత మాత్రాన జాబాలిని ఎవరూ ఏమీ చేయలేదే. భారతీయమైన దర్శనాల్లో కొన్ని నాస్తికదర్శనాలు. అథ్మాత్మికమైన విశ్వాసాల విషయంలో వాటిని అంగీకరించకపోవటంతో సహా పూర్తిస్వేఛ్చను ఆర్షధర్మం ఇచ్చింది. ఇతరమతాల్లో అటువంటి అవకాశం‌ ఉందా?

    మనుష్యుల ప్రవర్తనల్లో బిన్నత్వం ఉంటుంది. కొందరి విచక్షణ సరిగా లేనంతమాత్రాన మతానికే నల్లరంగుపులమాలని చూడటం‌ భావ్యం కాదు. అన్ని మతాల విశ్వాసాలూ అతివాదుల చేతుల్లో వక్రీకరణలకు గురి ఔతున్నాయి.

    హిందూమతం అని ఏమీ‌లేదు. మనది సనాతనమైన ఆర్షధర్మం మాత్రమే. మెజారిటీ ప్రజలు దీన్ని అవలంబిస్తున్నా మైనారిటీ‌ ఓటుబ్యాంకులకోసం వెంపర్లాడే రాజకీయాల మూలంగా దీని గట్టి దెబ్బ తగులుతున్నది. ఐనా వీరు చెప్పుకోదగ్గ సహనంతోనే ఉన్నారని చెప్పాలి.

    ReplyDelete